ఇంట్లో సామగ్రి అగ్నికి ఆహుతి
దెందులూరు: విద్యుదాఘాతంతో గోపన్నపాలెంలో ఆకుల సురేష్కు చెందిన ఇంట్లో ఫ్రిడ్జ్, సామగ్రి అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆకుల సురేష్ ఇంట్లో మంటలు ఎక్కువ కాకుండా అదుపు చేశారు. అప్పటికే ఇంట్లో ఫ్రిజ్తో పాటు రూ.లక్ష విలువచేసే సామగ్రి కాలిపోయింది.
పెనుగొండ: అప్పుల బాధతో చిట్ఫండ్ వ్యాపారి దొంగరావిపాలెం బ్రిడ్జి వద్ద శనివారం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండపేట మండలం ఏడిదకు చెందిన పల్లా సురేష్(52) చిట్ఫండ్ చేస్తూ నష్టాల పాలయ్యాడు. భార్య నాగలక్ష్మీకి చెందిన బంగారం అమ్మినా అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భార్య నాగలక్ష్మి తణుకులో జాన్వీ బ్యూటీ అకాడమీలో బ్యూటిషియన్గా పనిచేస్తోంది. అప్పులు బాధ ఎక్కువ కావడంతో ఏడిదలో ఉన్న ఇంటిని అమ్మే విషయంలో మనస్పర్ధలు రావడంతో తణుకు నుంచి ఏడిద వెళ్తూ గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. మృతుడుకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని 21వ వార్డు కొబ్బరితోట, మహంకాళమ్మ గుడి సమీపంలో ఉంటున్న నడపన రంగారావు(50) శనివారం సాయంత్రం టూ టౌన్లోని ఏలూరు కాలువలో ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. రంగారావు టీ సెంటర్లో పనిచేస్తున్నట్లు తెలిసింది. అగ్నిమాపక అధికారి కేవీ మురళీ కొండబాబు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు.


