టెక్‌జైట్‌–25 పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

టెక్‌జైట్‌–25 పోస్టర్‌ ఆవిష్కరణ

Sep 21 2025 1:21 AM | Updated on Sep 21 2025 1:21 AM

టెక్‌జైట్‌–25 పోస్టర్‌ ఆవిష్కరణ

టెక్‌జైట్‌–25 పోస్టర్‌ ఆవిష్కరణ

టెక్‌జైట్‌–25 పోస్టర్‌ ఆవిష్కరణ

నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో డిసెంబర్‌ 18 నుంచి 20 వరకు నిర్వహించనున్న టెక్‌జైట్‌–25 కార్యక్రమం పోస్టర్‌ను శనివారం డైరెక్టర్‌ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ ఈ టెక్‌జైట్‌ను ఈ సారి క్వాంటం టెక్నాలజీస్‌–షేపింగ్‌ ద ఫ్యూచర్‌, వన్‌ క్యాంటమ్‌ లీప్‌ ఎట్‌ ఏ టైమ్‌ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నామన్నారు. ఈ టెక్‌జైట్‌లో టెక్నికల్‌ ఈవెంట్స్‌, ఇన్నోవేషన్‌ ఎగ్జిబిషన్‌, రోబోటిక్స్‌ పోటీలు, పేపర్‌ ప్రజెంటేషన్‌లు, హాక్‌థాన్‌ పోటీలు, మేనేజ్‌మెంట్‌ కార్యకలాపాలతో పాటు సాంస్కృతిక సంబరాలను నిర్వహిస్తారన్నారు. టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌, ఇన్నోవేషన్‌, క్రియేటివిటీని ప్రోత్సహిస్తూ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ టెక్‌జైట్‌ వేదికగా నిలుస్తుందన్నారు. ఈ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో సెంట్రల్‌ డీన్‌ దువ్వూరి శ్రావణి, ఏఓ లక్ష్మణరావు, డీన్‌ సాదు చిరంజీవి, డీఎస్‌డబ్ల్యుఓ లు రాజేష్‌, దుర్గాభవాని, హెచ్‌ఓడీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement