అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

గోకవరం: స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో ఆదివారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వన్నేటి వెంకటేశ్వరరావు (53) గోకవరంలో ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. సింగారమ్మ చింత ఆలయం వద్ద భోజనానికి వెళ్లి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో సాయంత్రం మృతి చెంది ఉన్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై పవన్‌కుమార్‌ అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతికి గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement