రేషన్‌ బియ్యం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం స్వాధీనం

Oct 6 2025 2:42 AM | Updated on Oct 6 2025 2:42 AM

రేషన్‌ బియ్యం స్వాధీనం

రేషన్‌ బియ్యం స్వాధీనం

పెదపూడి: జి.మామిడాడలో ఒక ఇంట్లో నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తహసీల్దార్‌ పీవీ సీతాపతిరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అధికారులకు అందిన ముందస్తు సమాచారం మేరకు ఆదివారం జి.మామిడాడ గజం కాలువ సమీపంలో ఓ ఇంటిపై తహసీల్దార్‌తో పాటు వీఆర్వోలు దాడి చేశారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన 14.57 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుకున్నారు. పోలీసులు, ఎంఎస్‌ఓ కమల, వీఆర్వోలు వివరాలు సేకరించారు. ఆ బియ్యాన్ని వేళంగిలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించారు. అక్రమంగా బియ్యం నిల్వ ఉంచిన వేండ్ర గ్రామానికి చెందిన నర్ల సత్తిబాబుపై 6ఏ కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో వీఆర్వోలు కె.శ్రీను, ఎల్‌.రాంబాబు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement