నేడు ఆర్డీవో కార్యాలయంలో బార్లకు లాటరీ | - | Sakshi
Sakshi News home page

నేడు ఆర్డీవో కార్యాలయంలో బార్లకు లాటరీ

Sep 18 2025 11:07 AM | Updated on Sep 18 2025 11:07 AM

నేడు ఆర్డీవో కార్యాలయంలో బార్లకు లాటరీ

నేడు ఆర్డీవో కార్యాలయంలో బార్లకు లాటరీ

రాజమహేంద్రవరం రూరల్‌: రాజమహేంద్రవరంలోని ఆర్డీవో కార్యాలయంలో గురువారం ఉదయం 8 గంటలకు రెండో విడత బార్లకు లాటరీ తీయనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి చింతాడ లావణ్య తెలిపారు. జిల్లాలో మిగిలిన 16 బార్లకు గాను బుధవారం రాత్రి 9 గంటల వరకు 32 దరఖాస్తులు మాత్రమే రావడం జరిగిందన్నారు. నాలుగు దరఖాస్తులు వచ్చిన బార్లకు మాత్రమే లాటరీ తీయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 8 బార్లకు మాత్రమే నాలుగు దరఖాస్తులు చొప్పున వచ్చాయన్నారు. అర్ధరాత్రి 11.59 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామదని ఆమె తెలిపారు. మొదటి విడతలో ఆరు ఓపెన్‌ కేటగిరీలో, రిజర్వ్‌ కేటగిరిలో మూడు బార్లకు లాటరీ తీసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement