
అనధికార క్వారీల్లో తనిఖీలు
రౌతులపూడి: మండలంలోని ఎస్.పైడిపాల సర్వే నెంబరు 15లో అనధికారికంగా నిర్వహిస్తున్న నల్లరాయి క్వారీలో మైనింగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గురువారం రాత్రి చేపట్టిన ఈ తనిఖీలో రెండు చోట్ల అనధికార క్వారీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ మేరకు క్వారీల్లో పనిచేస్తున్న రెండు జేసీబీలు, ఒక లారీని సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎవరైనా అనధికారికంగా నల్లరాయి క్వారీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మైనింగ్ అధికారులు సత్యతేజ, రవీంద్రలు పాల్గొన్నారు.