కంబాలచెరువు: ఉభయ గోదావరి జిల్లాల్లో యూరాలజీ, కిడ్నీ వైద్య సేవల్లో అధుతన టెక్నాలజీతో స్థానిక గౌతమ్ యూరాలజీ, కిడ్నీ సెంటర్లో రాష్ట్రంలోనే తొలిసారిగా అత్యాధునిక 160 వాట్స్ పొటెంట్ వోల్మియమ్ హై పవర్ లేజర్ యంత్రాన్ని ప్రారంభించినట్లు ఆసుపత్రి అధినేత, డాక్టర్ గౌతమ్రెడ్డి మంగళవారం తెలిపారు. హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఏవీ రవికుమార్ చేతుల మీదుగా దీనిని ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ యూరాలజిస్టు డాక్టర్ టీవీ నారాయణరావు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆయన భార్య ఆదిలక్ష్మి, ప్రియాంక పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.


