అమలాపురం రూరల్: కిమ్స్ వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు దృష్టి సారించామని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ చాన్సలర్ పి.చంద్రశేఖర్ అన్నారు. ఆధునిక అకడమిక్ బ్లాక్లు, క్లినికల్ సెటప్లు, అడ్వాన్స్డ్ స్కిల్ అండ్ సిమ్యులేషన్ సెంటర్, వినూత్న సాంకేతికతో ఏర్పాటు చేసిన ఆయువు కమాండ్ సెంటర్ పనితీరు మెరుగ్గా ఉందని అన్నారు. ఆయన గురువారం అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాలను సందర్శించారు. కిమ్స్ చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు, ఎండీ రవికిరణ్ వర్మ పాల్గొన్నారు.


