తల్లీకుమారుడి దారుణ హత్య | Mother And Son Assassinate In Nizamabad District | Sakshi
Sakshi News home page

తల్లీకుమారుడి దారుణ హత్య

Jan 3 2021 6:52 PM | Updated on Jan 3 2021 7:09 PM

Mother And Son Assassinate In Nizamabad District - Sakshi

సాక్షి, చందూరు (నిజామాబాద్‌): జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చందూరు శివారులో తల్లీకుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. హుమ్నాపూర్‌ వాసి సావిత్రి(30) సహా రెండేళ్ల కుమారుడిని హత్య చేసిన నిందితుడు.. చందూరు శివారు అటవీ ప్రాంతంలో పాతిపెట్టాడు. గత నాలుగు రోజుల క్రితం హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తిగా సమాచారం. వివాహేతర సంబంధ వ్యవహారమే హత్యకు గల కారణంగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు.. పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement