పెళ్లయి ఐదేళ్లు.. మూడున్నరేళ్ల కుమారుడితో పాటు తల్లి అదృశ్యం | Married Woman Missing Mystery In Warangal | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల క్రితం వివాహం.. మూడున్నరేళ్ల కుమారుడితో పాటు తల్లి అదృశ్యం

Aug 29 2021 12:10 PM | Updated on Aug 29 2021 3:31 PM

Married Woman Missing Mystery In Warangal - Sakshi

అదృష్యమైన మహిళ రేష్మా, ఆమె కుమారుడు ఆయాన్‌

సాక్షి, సంగెం(వరంగల్‌): మూడున్నరేళ్ల కుమారుడితో కలిసి తల్లి అదృశ్యమైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని షాపూర్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ రఫీకి గత ఐదేళ్ల క్రితం రేష్మా(23)తో వివాహం జరిగింది. వీరికి ఆయాన్‌ (మూడున్నర సంవత్సరాలు) జన్మించాడు. రేవురి ప్రకాష్‌రెడ్డి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న రఫీ ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వస్తుంటాడు. ఎప్పటిలా 27వ తేది శుక్రవారం ఇంటి నుంచి డ్యూటీకి వెళ్లాడు.

తిరిగి రాత్రి ఇంటికి వచ్చే సరికి భార్య రేష్మా, కుమారుడు ఆయాన్‌ కన్పించలేదు. రఫీ ఇంటి నుంచి వెళ్లేటపుడు రేష్మా బ్లూ కలర్‌ పంజాబీ డ్రెస్, ఆయాన్‌ తెలుపు కలర్‌ చొక్కా, బ్లూకలర్‌ జీన్స్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నారు. తెలుపు రంగులో ఉన్న రేష్మా నుదుటిపై కాలిన మచ్చ ఉంటుంది. వీరి ఆచూకి తెలిసిన వారు సంగెం పోలీస్‌స్టేషన్‌ 9440700530, ఎస్సై 9440904629 నంబర్లకు తెలియజేయాలని పీఎస్సై జీనత్‌కుమార్‌ కోరారు.  

చదవండి: Nizamabad: గుప్పుమంటున్న గంజాయి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement