రూ. 400 అప్పు.. స్నేహితుడి హత్య  | Man Assassinated Friend For 400 Rupees In Thane | Sakshi
Sakshi News home page

రూ. 400 అప్పు.. స్నేహితుడి హత్య 

Feb 3 2021 8:44 PM | Updated on Feb 3 2021 8:50 PM

Man Assassinated Friend For 400 Rupees In Thane - Sakshi

ముంబై : తీసుకున్న అప్పు తిరిగివ్వలేదని స్నేహితుడ్ని దారుణంగా హత్య చేసాడో వ్యక్తి. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. థానే జిల్లా, ఉల్హాస్‌నగర్‌కు చెందిన సోను, ఫాహిమ్‌ ఓ జీన్స్‌ తయారీ కంపెనీలో పని చేస్తున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు. కొద్దిరోజుల క్రితం ఫాహిమ్‌, సోను దగ్గర 400 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే తీసుకున్న అప్పు తీర్చడానికి ఫాహిమ్‌ సుముఖత చూపలేదు. ( పైనుంచి అమ్మాయిల గదిలోకి ఊడిపడ్డాడు!)

దీంతో తరచుగా స్నేహితులిద్దరికీ గొడవలయ్యేవి. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా గొడవైంది. సోను, ఫాహిమ్‌ను హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement