ప్రేమికుల కిడ్నాప్‌.. సినిమాను తలపించేలా

Lovers Kidnapped By Uncle In Kurnool District - Sakshi

కిడ్నాపర్ల చెర నుంచి విడిపించిన పోలీసులు  

కర్నూలు (టౌన్‌): పెళ్లి చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్న ప్రేమికులను కర్నూలు సమీపంలో శుక్ర వారం కిడ్నాప్‌ చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో కిడ్నాపర్ల చెర నుంచి వారిని విడిపించి..పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆస్పరి వాసి అనిల్‌ కుమార్, నందికొట్కూరు చెందిన జయదాంబ వరుసకు బంధువులు. కొంత కాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని.. తల్లిదండ్రులకు చెప్పారు. వారు ససేమిరా అనడంతో శుక్రవారం ఇంట్లో చెప్పకుండా ఇరువురూ పారిపోయారు. పెళ్లి చేసుకోవాలని 

నందికొట్కూరు పట్టణం పగిడ్యాల రోడ్డులో ఉన్న బ్రహ్మం గారి గుడిలో ఏర్పాట్లు చేసుకున్నారు. కర్నూలు నుంచి వాహనంలో అక్కడకు వెళుతున్న సమయంలోనే అమ్మాయి తరఫున మేనమాన మునుస్వామి, తొమ్మిది మంది అనుచరులతో తుపాన్‌ వాహనంలో వెంబడించారు. కర్నూలు సమీపంలోని నంద్యాల చెక్‌పోస్టు వద్ద ప్రేమికులివురినీ కిడ్నాప్‌ చేశారు. ప్రాణ భయంతో ప్రేమికులు 100 డయల్‌ చేయడంతో ట్రాఫిక్‌ డీఎస్పీ వెంటనే స్పందించారు. నంద్యాల చెక్‌పోస్టు దాటిన తరువాత వాహనాన్ని గుర్తించి పట్టుకున్నారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు ప్రేమికులను నందికొట్కూరు పోలీసులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top