తల్లితో ఆస్పత్రికి.. బాలికపై సామూహిక అత్యాచారం | Hospital Ward Boy And 2 Other Molested Girl In Karnataka | Sakshi
Sakshi News home page

తల్లితో ఆస్పత్రికి.. బాలికపై సామూహిక అత్యాచారం

Dec 7 2020 8:20 AM | Updated on Dec 7 2020 8:33 AM

Hospital Ward Boy And 2 Other Molested Girl In Karnataka - Sakshi

శివమొగ్గ: తల్లికి వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన బాలికపై గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. ఈ ఘోరం కర్ణాటకలోని శివమొగ్గ ప్రభుత్వ మెగ్గాన్‌ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కరోనా బాధిత మహిళ ఒకరు 20 రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె వెంట కుమార్తె (14)కూడా ఉంటోంది. ఆ బాలికపై కన్నెసిన వార్డుబాయ్‌ మనోజ్‌ పరిచయం పెంచుకుని రోజూ హోటల్‌ నుంచి భోజనం తెచ్చి ఇచ్చేవాడు. శనివారం రాత్రి హోటల్లో తినేసి వద్దామని కారులో బాలికను ఎక్కించుకుని వెళ్లాడు. మరో ముగ్గురు యువకులు కూడా కారులో ఉన్నారు. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి బాలికపై నలుగురూ లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక స్పృహ కోల్పోవడంతో మళ్లీ కారులోనే ఆస్పత్రికి తీసుకొచ్చారు. అనంతరం బాధితురాలు దారుణాన్ని వెల్లడించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement