
ప్రభుత్వాన్ని విమర్శించడం నేరం కాదు
రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛలో భాగమే పత్రికా స్వేచ్ఛ. అలాంటి పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించటం అంటే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ‘ జర్నలిస్ట్ ల పై క్రిమినల్ కేసులు పెట్టడం మానుకోవాలి. భావప్రకటన స్వేచ్ఛ కు విఘాతం కలిగించ రాదు.‘ అని సుప్రీం కోర్టు ప్రభుత్వాలను ఇటీవల హెచ్చరించింది. ‘ ప్రభుత్వాన్ని విమర్శించడం నేరం కాదని కూడా సుప్రీం కోర్టు మరొక కేసులో స్పష్టం చేసింది. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై పెట్టిన కేసులను కూటమి ప్రభుత్వం ఉప సంహరించుకోవాలి.
– రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్ట్, తిరుపతి