
హరీష్కు ప్రతిష్టాత్మక అవార్డు
చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఐసీఆర్టీ) ప్రతిష్టాత్మకంగా ఇచ్చే యూత్ ఎంపవర్మెంట్ అవార్డుకు ఎంబీఏ విద్యార్థి హరీష్ బాబు ఎంపికయ్యారు. మంగళవారం ఈ మేరకు ఐసీఈఆర్టీ ఈడీ సిమ్రాన్ మెహతా ప్రకటించారు. హరీష్ చిత్తూరులోని విజయం ఎంబీఏ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. వరల్డ్ యూత్ స్కిల్స్ డే రోజున నిర్వహించే కార్యక్రమంలో హరీష్ ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల చైర్మన్ తేజోమూర్తి, డైరెక్టర్ శైలజా, ఐరాల మండలం 45 కొత్తపల్లి సర్పంచ్ బాలాజీ అభినందించారు.