
బదిలీల్లో కూటమి ఎత్తుగడ
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల బదిలీల్లో కూటమి ప్రభుత్వం తన ఎత్తుగడను మానుకోవాలని వైఎస్సార్టీఎఫ్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి హితవు పలికారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్జీటీల ప్రత్యక్ష కౌన్సెలింగ్కు ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటాలను విచ్ఛిన్నం చేస్తోందన్నారు. వెబ్ఆప్షన్లు పెట్టుకోవాలని ఎస్జీటీలను విద్యాశాఖ అధికారులు బెదిరించడం అన్యాయమన్నారు. వెబ్ల్యాండ్లో ఉన్న తప్పుల కారణంగా జిల్లాలో 70 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్లు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ టీచర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మాట్లాడుతున్న వైఎస్సార్టీఏ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి