భాషోపాధ్యాయులకు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

భాషోపాధ్యాయులకు అన్యాయం

Jun 10 2025 7:08 AM | Updated on Jun 10 2025 7:08 AM

భాషోపాధ్యాయులకు అన్యాయం

భాషోపాధ్యాయులకు అన్యాయం

చిత్తూరు కలెక్టరేట్‌ : భాషోపాధ్యాయుల అప్‌గ్రేడ్‌ ప్రక్రియ పూర్తి చేయాలని ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు వినాయకం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టినట్లు తెలిపారు. గత ఆరేళ్ల నుంచి డీఈవో పూల్‌లో ఉన్న అసంబంద్ధతను తొలగించాలన్నారు. 2017లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భాషోపాధ్యాయుల ఉన్నతీకరణకు జీవో 90ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఆ తర్వాత 2019 నవంబర్‌లో సవరించి జీవో నం.77 ప్రవేశపెట్టి అర్హతలేని 1,300 మంది భాషోపాధ్యాయులు కేడర్‌ లేక నష్టపోతున్నారన్నారు. వారందరినీ డీఈవో పూల్‌లో పెట్టి ఇబ్బందులకుగురిచేస్తున్నారన్నారు. బదిలీల మధ్యలో వర్క్‌అడ్జస్ట్‌మెంట్‌ ప్రక్రియ చేసి భాషోపాధ్యాయులను దూరప్రాంతాలకు వెళ్లి పనిచేయాలనడం దారుణమన్నారు. డీఈవో పూల్‌ లో ఉన్న టీచర్లకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు చందు, శ్రీరాములు, భానుప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement