
● కొనేలేమంటున్న ఫ్యాక్టరీ నిర్వాహకులు ● అధికారులకు ఫిర్
చిత్తూరు రూరల్(కాణిపాకం) : కూటమి ప్రభుత్వం తోతాపురికి గిట్టుబాటు ధర కల్పించామని ఊదరగొడుతోంది. తోతాపురి కిలోల రూ.8కు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని గొప్పలు చెప్పుకుంది. అయితే ఆచరణలో తోతాపురి నిర్ణయ ధర అమలుకు నోచుకోవడం లేదు. రూ. 8కే కొనుగోలు చేయాలని అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. ఫ్యాక్టరీలు తోతాపురి కిలో రూ. 8కే కొనుగోలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం కిలోకు రూ.4 ఇస్తామని వెల్లడించింది. దీంతో కూటమికి చెందిన రైతు నాయకులు సంబరపడిపోయారు. మంగళవారం తోతాపురి కిలో రూ.5కు కొనుగోలు చేయడంతో రైతులు మండిపడుతున్నారు. ఫ్యాక్టరీలు రూ. 5 కంటే ఎక్కువ కొనుగోలు చేయలేమని చేతులెత్తేస్తోంది. దీంతో కలెక్టర్కు ఫిర్యాదులు వెళ్లాయి.
ఫ్యాక్టరీలు సిండికేట్?
జిల్లాలోని ఫ్యాక్టరీలు సిండికేట్ అయిందనే వాదనలు గట్టిగా వినిపిస్తోంది. దీంతో తోతాపురి కాయలను ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ, విద్యాశాఖ మంత్రుల దృష్టికి ఈ వారంలో తీసుకెళ్లేందుకు నిర్వాహకులు ఏకమయ్యారు.
మార్కెట్కు 300 టన్నుల కాయలు
చిత్తూరు నగరంలో మార్కెట్కు 300 టన్నుల మామిడి కాయలు వచ్చాయి. 200 బేనీషా రాగా మిగిలిన 100 టన్నులు వివిధ రకాల టేబుల్ రకాలు వచ్చినట్లు ట్రేడర్లు అంచనా వేశారు. అయితే బేనీషా ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. తోతాపురి (టేబుల్ రకం), చందూర, ఇమామ్ పసంద్, కాలేపాడు తదితర రకాల ధరలు సాధారణంగానే ఉన్నాయి.
చిత్తూరు మామిడి కాయల మార్కెట్లో కాయలను ప్యాకింగ్చేస్తున్న కూలీలు
మామిడి ధరలు ఇలా
రకం కిలో ధర
(రూ.లలో)
తోతాపురి 5
బేనీషా 13–23
మల్లిక 12–25
తోతాపురి
(టేబుల్రకం) 11–14
రకం కిలో ధర
(రూ.లలో)
అల్పోన్సో 20–25
కాలేపాడు 20–40
చందూర 5–13
చక్కెర గుత్తి 60–70
ఇమామ్ పసంద్ 40–70