
ప్రతి మండలానికి పీఎం ‘సూర్యఘర్’
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని ప్రతి మండలానికి 500 పీఎం సూర్యఘర్ కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకోవాలని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్, పీఎం సూర్యఘర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ నరేంద్రనాథ్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక అర్బన్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. సెక్షన్ పరిధిలో రోజు 20 మంది వియోగదారులకు వీటిపై ప్రచారం చేయాలన్నారు. నెలకు 300 యూనిట్లు దాటిన ఓసీ, బీసీ వినియోగదారులపై ఎక్కువగా దృష్టి పెట్టాలన్నారు. బీసీలకు ప్రభుత్వం అదనంగా రూ.20 వేలు సబ్సీడీ ఇస్తోందని వీటిపై అవగాహన కల్పించాలన్నారు. సూర్యఘర్ నమోదును ఆన్లైన్లో చేయించి వెండర్లతో అనుసంధానం చేయించాలన్నారు. జిల్లాలో 3,200 వ్యవసాయ సర్వీసులను సకాలంలో విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఈఈ మునిచంద్ర, టెక్నికల్ ఈఈ జగదీష్, ఏఓ ప్రసన్న ఆంజనేయులు డీఈలు ప్రసాద్, ఆనంద్ పాల్గొన్నారు.