
గోసంరక్షణ ట్రస్టుకు విరాళం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన గోసంరక్షణ ట్రస్టుకి తవణంపల్లి మండలం, మైనగుండ్లపల్లి గ్రామానికి చెందిన రాజారెడ్డి రూ.లక్ష నగదును విరాళంగా ఇచ్చారు. ఆలయ సిబ్బంది దాత కుటుంబానికి ప్రత్యేక దర్శనభాగ్యం కల్పించారు.
వ్యవసాయశాఖా మంత్రి జిల్లా పర్యటన వాయిదా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా పర్యటనకు శుక్రవారం విచ్చేయాల్సిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెంనాయుడు పర్యటన అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ఆయన తదుపరి పర్యటన వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.
వివాహిత ఆత్మహత్యాయత్నం
చౌడేపల్లె( పుంగనూరు): పుంగనూరు పట్టణ సమీపంలోని నక్కబండలో వివాహిత అత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. నక్కబండకు చెందిన షాహీదా(28) తన అవసరాల కోసం కొంతమంది వద్ద అప్పు చేసింది. వారి నుంచి వేధింపులు అఽధికం కావడంతో ఇంట్లో నిద్ర మాత్రలు మింగి అపస్మార ిస్థితికి చేరింది. కుటుంబ సభ్యులు ఆమెను పుంగనూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో
గాయపడ్డ వ్యక్తి మృతి
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని కాణిపాకం–తిరుపతి బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రాజేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. బుధవారం తన భార్య, ఇద్దరు పిల్లలతో చెర్లోపల్లె నుంచి చిత్తూరు వైపు వస్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ, స్కూటర్ను ఢీ కొట్టడంతో నలుగురూ గాయపడ్డ విషయం తెలిసిందే. రాజేష్, అతని భార్య పూర్ణిమ ఇద్దరి పరిస్థితి విషమించడంలో తమిళనాడు రాణిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తుండగా గురువారం ఉదయం 4 గంటల ప్రాంతంలో రాజేష్ చనిపోయాడు. పూర్ణిమ పరిస్థితి విషమంగా ఉంది.
పందెం రాయుళ్ల అరెస్ట్
చౌడేపల్లె(పుంగనూరు): పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువులో గురువారం కోడిపందాలు ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. ఎస్ఐ కథనం.. పుంగమ్మ చెరువు సమీపంలోని పాములకుంట వద్ద కోడిపందేలు నిర్వహిస్తున్నారని అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలసి దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో 8 మందిని అదుపులోకి తీసుకోగా వారి వద్ద నుంచి పది కోడి పుంజులు, రూ.20,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.