నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

Jun 12 2025 7:37 AM | Updated on Jun 12 2025 8:42 AM

● నేట

● నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● పూర్తి కాని ఉపాధ్య

కూటమి పాలనలో సర్కారు బడుల్లో చదువు గాల్లో దీపంలా మారింది. వేసవి సెలవులు అనంతరం జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా సర్కారు బడుల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రభుత్వ బడుల్లో టీచర్ల కొరత, బదిలీలు పూర్తి కాకపోవడంతో గందరగోళ పరిస్థితి, పునఃప్రారంభం రోజు అందజేసే విద్యా మిత్ర కిట్లు అరకొరగా చేరడం, మరుగుదొడ్లు అధ్వానంగా ఉండడంతో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ పాలనలో వెలుగు వెలిగిన సర్కారు బడులు ప్రస్తుతం కూటమి పాలనలో అస్తవ్యస్తంగా మారాయి. నేడు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం నేపథ్యంలో సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌ కథనం.

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్కారు బడులు కూటమి పాలనలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ సర్కారులో సకల వసతులతో ఆహ్లాదకరంగా సాగిన సర్కారు చదువు ప్రస్తుత కూటమి పాలనలో ప్రశ్నార్థకంగా మారింది. నేడు పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వెంటాడుతున్న సమస్యలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లాలోని సర్కారు బడుల్లో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి.

ఆరుబయటే చదువులు
జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్కారు బడుల్లో నాడు–నేడు పథకాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో జిల్లాలోని వేలాది పాఠశాలల్లో మౌలిక వసతులు కొట్టుమిట్టాడుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ సర్కారు పాలనలో మొదటి విడత నాడు–నేడులో 1533 పాఠశాలల్లో రూ.354 కోట్లతో, రెండో విడతలో 1183 పాఠశాలలు, 30 జూనియర్‌ కళాశాలల్లో రూ.424 కోట్లతో పనులు చేపట్టారు. రెండో విడతలో నిర్వహిస్తున్న పనులను కూటమి సర్కారు నిలిపివేయడంతో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సీఎం సొంత నియోజకవర్గమైన కుప్పంలో మాత్రమే పనులు నిర్వహిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాలపై సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. పలు పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా గదులు లేక ఆరుబయట చదువులకు స్వాగతం పలికే పరిస్థితి నెలకొంది.

బదిలీలు పూర్తికాకముందే..

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో గత నెల రోజులుగా టీచర్లలో అన్ని కేడర్‌లకు బదిలీలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజుకు టీచర్ల కొరత లేకుండా చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ఆర్భాటంగా గొప్పలు చెప్పారు. అయితే ఆ మాటలు ఒట్టిమాటలేనని తేలిపోయింది. ఇప్పటి వరకు డీఎస్సీ పరీక్షలు, బదిలీల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు. జిల్లాలో ఇంకా 3 వేలకు పైగా ఎస్జీటీ టీచర్లకు బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి ఉంది. అదే విధంగా స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు, హిందీ టీచర్లు బదిలీ అయినప్పటికీ వారిని రిలీవ్‌ చేయని పరిస్థితి. మరికొన్ని పాఠశాలల్లో టీచర్లు బదిలీలు అయినప్పటికీ రిలీవర్‌ లేకపోవడంతో ఏమి చేయాలో తెలియని దుస్థితి. అదే విధంగా వేల మంది ఎస్జీటీలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుండటంతో పాఠశాలల పునః ప్రారంభం రోజున పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి. దీంతో తొలిరోజే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు లేక బోసిపోవాల్సిన దుర్భర పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి.

పబ్లిసిటీ ఫుల్‌..సరఫరా అంతంతే..

జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు తొలిరోజే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతో స్టూడెంట్స్‌ కిట్లు అందజేస్తామని కూటమి గొప్పలు చెప్పింది. అందుకు అవసరమైన పబ్లిసిటీని చేసుకుంది. అయితే ఈనెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఆ కిట్లను చేర్చలేక విఫలం అయ్యింది. జిల్లాలోని 2462 పాఠశాలల్లో చదువుతున్న 148430 విద్యార్థులకు, నూతనంగా అడ్మిషన్లు పొందే విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయాల్సి ఉంది. అయితే పూర్తి స్థాయిలో కిట్లను సరఫరా చేయకుండా అరకొరగా పంపిణీ చేశారు. పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌, బ్యాగులు, యూనిఫాం అరకొరగా వచ్చాయి. షూలు ఒక్కటీ అందలేదు.

విద్యార్థులకు అందించే కిట్‌ వివరాలు

కిట్‌లోని వస్తువులు పంపిణీ చేయాల్సినవి ఇప్పటి వరకు వచ్చినవి ఇంకా రావాల్సినవి

పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌ 1587618 1571868 15750

బ్యాగులు 144400 126604 17796

యూనిఫాం 144400 67800 76600

బెల్టులు 103563 103563 –

షూస్‌ 144189 00 144189

6 వ తరగతి డిక్షనరీలు 12771 12771 –

1వ తరగతి డిక్షనరీలు 24728 24728 –

నోటు పుస్తకాలు 836872 836872 –

కార్పొరేట్‌కు అనుకూలంగా కూటమి

కూటమి సర్కారు సర్కారు బడులను నిర్వీర్యం చేసేలా కుట్రలు చేస్తోంది. గత ప్రభుత్వం సర్కారు బడులకు అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ ప్రభుత్వం కార్పొరేట్‌ బడులను బలోపేతం చేస్తోంది. పాఠశాలలు పునఃప్రారంభం రోజున పూర్తి స్థాయిలో విద్యార్థులకు కిట్లు ఇవ్వకపోవడం సర్కారు వైఫల్యమే. అదే విధంగా గత సర్కారు నిర్వహిస్తున్న నాడు–నేడు పనులను నిలిపివేయడంతో పాఠశాలల్లో మౌలిక వసతులు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. – సద్ధాం,

స్టూడెంట్స్‌ జేఏసీ చైర్మన్‌, చిత్తూరు జిల్లా

● నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● పూర్తి కాని ఉపాధ్య1
1/4

● నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● పూర్తి కాని ఉపాధ్య

● నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● పూర్తి కాని ఉపాధ్య2
2/4

● నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● పూర్తి కాని ఉపాధ్య

● నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● పూర్తి కాని ఉపాధ్య3
3/4

● నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● పూర్తి కాని ఉపాధ్య

● నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● పూర్తి కాని ఉపాధ్య4
4/4

● నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● పూర్తి కాని ఉపాధ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement