
అక్రమ గ్రా‘నైట్’ ..రైట్ రైట్
● పెద్దిశెట్టిపల్లిలో అక్రమ క్వారీ ● రోజుకు రూ.3 లక్షలు విలువ చేసే గ్రానైట్ తరలింపు ● యథేచ్ఛగా తమిళనాడుకు రవాణా ● అక్రమార్కులతో కుమ్మకై ్కన అధికారులు
సాక్షి టాస్క్ఫోర్స్ : చిత్తూరు మండలం పెద్దిశెట్టిపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ క్వారీ తవ్వకాలు జోరందుకున్నాయి. కూటమి నేతలు విలువైన గ్రానైట్ను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అధికారం మాదే..అడ్డుకునేది ఎవరంటూ..యథేచ్ఛగా గ్రానైట్ తవ్వకాలు చేపట్టారు. రెండు నెలలుగా ఈ తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు, మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. మామూళ్ల మత్తులో జోగుతూ...అక్రమ గ్రానైట్కు రైట్..రైట్ చెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకూ రూ. 3 లక్షలు విలువ చేసే గ్రానైట్ బండలు యథేచ్ఛగా పెద్దిశెట్టిపల్లి నుంచి గుడిపాల మీదుగా తమిళనాడుకు తరలుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అనుమతి లేకుండా ఎలా క్వారీ తవ్వకాలు చేస్తున్నారని ప్రశ్నిస్తే..నోరు మెదపడం లేదని వారు మండిపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను నియంత్రించాలని వారు కోరుతున్నారు.