అలమటించిన అన్నదాత | - | Sakshi
Sakshi News home page

అలమటించిన అన్నదాత

Jun 11 2025 9:12 AM | Updated on Jun 11 2025 9:12 AM

అలమటి

అలమటించిన అన్నదాత

గంగాధర నెల్లూరు : మామిడిని రైతుల నుంచి కిలో రూ.12లకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను గుజ్జు ఫ్యాక్టరీ యజమానులు బేఖాతర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం జీడీనెల్లూరులోని జైన్‌ కంపెనీ ఎదుట మండుటెండలో కడపు మాడ్చుకుని మామిడి పంటను అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. ఉదయం నుంచి టోకెన్‌ కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యం, అధికారులు పట్టించుకోలేదని అన్నదాతలు అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు మండలంలోని వందలాది మంది మామిడి రైతులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. మొత్తం 1,100 మంది రైతులు పంట విక్రయానికి దరఖాస్తు చేసుకుంటే కేవలం 300 మందికి మాత్రమే టోకెన్లు మంజూరు మిగిలిన వారిని వెనక్కి పంపించేశారు. ట్రాక్టర్లలో మామిడి లోడ్‌తో వచ్చిన వారికి నిరాశే మిగిలింది. కొందరు సిఫార్సులతో టోకెన్‌ పొందారని, మండటెండలో ఎదురు చూసిన వారికి పక్కనపెట్టేశారని పలువురు ఆరోపించారు.

అవస్థలు పడిన మామిడి రైతులు

పట్టించుకోని ఫ్యాక్టరీ యాజమాన్యం, అధికారులు

టోకెన్ల కోసం తప్పని సిఫార్సులు

అలమటించిన అన్నదాత 1
1/2

అలమటించిన అన్నదాత

అలమటించిన అన్నదాత 2
2/2

అలమటించిన అన్నదాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement