
‘అయ్యో’ర్ల పడిగాపులు
● రాత్రి 9.50 గంటలైనా ప్రారంభం కాని కౌన్సెలింగ్ ● ఉదయం నుంచి ఎదురుచూస్తున్న టీచర్లు ● రాత్రి 9.20 గంటలకు సీనియారిటీ జాబితా విడుదల ● కౌన్సెలింగ్ కేంద్రంలోకి సంఘం నేతలకు నో ఎంట్రీ
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు మండలాల నుంచి విచ్చేసిన ఎస్జీటీలు బదిలీల కౌన్సెలింగ్ కోసం జిల్లా కేంద్రంలో పడిగాపులు కాశారు. రా త్రి 9.50 గంటల సమయం అయినప్పటికీ కౌన్సెలింగ్ ను విద్యాశాఖ అధికారులు ప్రారంభించలేదు. ఈ కౌ న్సెలింగ్కు హాజరైన ఎస్జీటీ టీచర్ల సీనియారిటీ ప్రకా రం బదిలీలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారు లు చర్యలు చేపట్టారు. పలు మండలాల నుంచి హాజరైన టీచర్లు కౌన్సెలింగ్ కేంద్రంలో చీకటిలో కూర్చుని రాత్రంతా నిరీక్షించారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు రాత్రి 9.20 గంటలకు ఎస్జీటీల సీనియారిటీ జాబితా ను విడుదల చేశారు. అయితే ఆ జాబితాలో సమగ్ర సీ నియారిటీ జాబితాను ప్రదర్శించాలని టీచర్లు డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు 350 వరకు మాత్ర మే జాబితాను విడుదల చేసి మిన్నకుండి పోవడంతో ఎస్జీటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర సీనియారిటీ జాబితాను విడుదల చేస్తే బదిలీల్లో న్యాయం జరుగుతుందని పలువురు ఎస్జీటీలు వెల్లడించారు.
సంఘం నాయకులకు నో ఎంట్రీ
కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో టీచర్ల తరపున సమస్యలను పరిష్కరించుకునేందుకు వివిధ సంఘాలు పాల్గొనడం ఆనవాయితీ. అయితే ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ సంఘం నాయకులు హాల్లోకి రాకూడదని జిల్లా విద్యాశాఖ అధికారులు హుకుం జారీ చేశారు. ఎన్నడూ లేని వింత విధానాలను చిత్తూరు విద్యాశాఖ అధికారులు అమలు చేస్తున్నారని వివిధ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘం నాయకులు ఇతర జిల్లాల్లో విచారించగా సంఘం నాయకులను అనుమతిస్తున్నారని తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన సంఘం నాయకులు ఉద్దేశపూర్వకంగా అనుమతించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.