
రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
నగరి : రోడ్డు ప్రమాదంలో బాలాజీ (39) అనే రైతు మృతి చెందిన ఘటన మండలంలోని బుగ్గఅగ్రహారం వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. తిరుపతి జిల్లా, నారాయణవనం మండలం, దక్షిణపాలమంగళానికి చెందిన బాలాజీ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం రాష్ట్ర సరిహద్దు తమిళనాడుకు చెందిన పుణ్యంకు వెళ్లి తిరుగు ప్రయాణంలో పాలమంగళంకు నాగలాపురం రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా బుగ్గ అగ్రహారం వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన బాలాజీ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ట్రాక్టర్, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ విజయ్నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మృతి చెందిన రైతు పాలమంగళం దక్షిణపు కండ్రిగ సర్పంచ్ కుమారుడు అని గుర్తించారు .