
వర్షానికి నేలకూలిన వృక్షం
– ముగ్గురికి తీవ్ర గాయాలు
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షం ముగ్గురిని ఆసుపత్రి పాలు చేసింది. నగరంలో రాత్రి 45 నిమిషాల పాటు వర్షం కురిసింది. పలమనేరు రోడ్డులో చెట్టు కింద ఉండగా ఉన్నపలంగా చెట్టు రోడ్డుపై కూలిపోయింది. ఆ సమయంలో కింద పడ్డ చెట్టు కొమ్మ తగిలి చిత్తూరు మండలం ఏనుగుండ్లపల్లికి చెందిన రత్నవేలు, నగరంలోని మిట్టూరుకు చెందిన యశ్వంత్, తమిళనాడులోని వేలూరుకు చెందిన గోవిందస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు స్థానికులు రోడ్డుపై చెట్టును తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులేకుండా చేశారు.

వర్షానికి నేలకూలిన వృక్షం

వర్షానికి నేలకూలిన వృక్షం

వర్షానికి నేలకూలిన వృక్షం