
తమ్ముళ్ల వాగ్వాదం
జీడీనెల్లూరు మండలంలో టీడీపీ ఇరు వర్గాలు నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మాట నిలబెట్టుకున్నారు
గత ఐదేళ్ల పాటు ఇచ్చిన హామీ ప్రకారం పథకాలు అమలు చేసి వైఎస్ జగన్ మాట నిలబెట్టుకున్నారు. నాలుగు సంవత్సరాలు చేయూత ఆర్థిక సహాయంతో పాటు నా పిల్లలకు అమ్మఒడి పథకం లబ్ధి చేకూరింది. ప్రస్తుత కూటమి సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. – సలోమీ, గుడిపాల మండలం
ఆడబిడ్డ నిధి ఇవ్వాలి
ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి పథకం అ మలు చేసి ప్రతి నెలా రూ.1500 ఇస్తామన్నా రు. ఇంత వరకు ఆ పథ కం అమలు గురించే పట్టించుకోలేదు. గతంలో ఏటా నా ఖాతాలోకి ఈబీసీ నేస్తం పథకం డబ్బులను జమచేశారు. గత సర్కారు పాలనలో అందిన సంక్షేమ పథకాల ఆర్థిక సాయంతో కిరాణం పెట్టుకున్నాను. ఆడబిడ్డ నిధి అమలు చేయాలి. – సరసమ్మ, లబ్దిదారురాలు, చిత్తూరు మండలం
కిరాణా కొట్టు నడుపుతున్నా
గత సర్కారు పాలనలో కాపునేస్తం ద్వారా నాకు రూ.60 వేలు ఆర్ధికసా య ం అందింది. ఆ సాయంతో దుకాణం నడుపుతూ కుటుంబానికి అండగా ఉన్నా. ప్రస్తుతం ఇలాంటి సాయం అందలేదు. ప్రస్తుత ప్రభు త్వం కాపులకు ప్రత్యేకంగా ఎలాంటి ఆర్ధిక సాయం అందించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏ హామీ అమలు చేయ లేదు. – కాటమ్మ, అత్తూరు, నిండ్రమండలం చిత్తూరు జిల్లా
పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు
ప్రస్తుత కూటమి ప్రభు త్వం సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో తెలియడం లే దు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఇంత వరకు ఊసేలేదు. గత ప్రభుత్వం నాలుగు విడతల్లో ఈబీసీ నేస్తం నగదు అందుకున్నాను. ఆ నగదుతో కుట్టుమిషన్ కొనుగోలు చేసుకుని అభివృద్ధి చెందా.
– వనమ్మ, లబ్ధిదారురాలు, చిత్తూరు మండలం
– 8లో

తమ్ముళ్ల వాగ్వాదం

తమ్ముళ్ల వాగ్వాదం

తమ్ముళ్ల వాగ్వాదం