
వైఎస్సార్సీపీ పాలనలో భరోసా
2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అమ్మ ఒడి కింద జిల్లాలోని 1,52,743 మంది తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ఏటా రూ.229.11 కోట్లు ఖర్చు చేసింది. అంతే కాకుండా జిల్లాలోని రూరల్లో ఉన్న 95,994 స్వయం సహాయక గ్రూపులకు గాను రూ.196.98 కోట్లు, అర్బన్లోని 12933 స్వయం సహాయక గ్రూపులకు గాను రూ.19.90 కోట్లు చొప్పున సున్నా వడ్డీ అందించి ఆదుకుంది. వైఎస్సార్ చేయూత ద్వారా రూరల్లో 172616 మందికి రూ.323.66 కోట్లు, అర్బన్ లో 19144 మందికి రూ.35.9 కోట్లు, కాపు నేస్తం పథకంలో 6656 మందికి రూ.10 కోట్లు, వైఎస్సార్ ఆసరా పథకంలో రూరల్లో 270197 మందికి రూ.568.51 కోట్లు, అర్బన్లో 47026 మందికి రూ.47.70 కోట్లు చొప్పున అందించి మహిళల మనస్సుల్లో గత సీఎం వైఎస్ జగన్ సర్కార్ చెరగని ముద్ర వేసింది.
వైఎస్సార్ సీపీ పాలనలో పేదలకు ఇళ్ల పట్టాభిషేకం
గత వైఎస్సార్సీపీ పాలనలో చిత్తూరు జిల్లాలో 1,67,308 మందికి ఉచిత ఇళ్ల పట్టాలను అందజేసి పేదవాడి సొంతింటి కల ను నెరవేర్చింది. వారందరికీ ఉచితంగా గృహాలు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం చేశారు. కులం,మతం, ప్రాంతం, పార్టీలు ఏవీ చూడకుండా ఇంటి పట్టాలను మంజూరు చేసి మహిళల పేరుతో ఉచితంగా రిజిస్టర్ చేయించారు. గతంలో జిల్లాలో ఏర్పాటు చేసిన 1039 లే అవుట్లో పక్కాగృహాలతో కళకళలాడుతున్నాయి.