
వైద్యులు బాధ్యతగా విధులు నిర్వహించాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పీహెచ్సీలలో విధులు నిర్వహిస్తున్న మెడికల్ ఆఫీసర్లు బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మాతా శిశు సంరక్షణలో మెడికల్ ఆఫీసర్లు తమ పరిధిలో ఉన్న ఏఎన్ఎంలు, ఆశాలు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఆర్సీహెచ్ కార్యక్రమంలో గర్భిణుల నమోదు, వారికి అందించాల్సిన సేవలు కచ్చితత్వంతో నిర్వహించాలన్నారు. గర్భిణుల వివరాలు నమోదు చేసే సమయంలో ఎలాంటి తప్పిదాలు ఉండకూడదన్నారు. హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పుట్టిన ప్రతి బిడ్డ వివరాలను రిజిస్ట్రేషన్ చేయడం వల్ల వారికి నిర్ధేశించిన సమయంలో వ్యాక్సినేషన్ అందించవచ్చన్నారు. ఈ విషయంలో ఏఎన్ఎంలు అలసత్వం వహించకూడదని తెలిపారు. ఎవరైనా విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమీక్షలో డీఎంఅండ్హెచ్వో సుధారాణి, అడిషనల్ డీఎంఅండ్హెచ్వో వెంకటప్రసాద్, డీఐవో హనుమంతరావు, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

వైద్యులు బాధ్యతగా విధులు నిర్వహించాలి