
చట్టం పకడ్బందీగా అమలు చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో బాల, కౌమార కార్మిక వ్యవస్థ (నిషేధ, నియంత్రణ) చట్టం 1986 (సవరణ చట్టం 2016)ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..14 ఏళ్లలోపు బాలలను పనిలోకి అనుమతించకూడదన్నారు. 18 ఏళ్లలోపు వారిని పనుల్లోకి తీసుకోవడం నేరమన్నారు. బాల కార్మికులకు సంబంధించి ఫిర్యాదులుంటే 1098 నంబర్లో సంప్రదించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఇటుక బట్టీలు, మైనింగ్ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డెయిరీ పరిశ్రమల్లో బాల కార్మికులను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టాలన్నారు. అనంతరం కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం గోడ పత్రికలను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా కార్మిక శాఖ అధికారి ఓంకార్, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వరి, రియల్ ఎడ్యుకేషన్ , లిటరసీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.