
ఆడబిడ్డకు అగచాట్లు!
సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు పాలన జూన్ 12కు ఏడాది గడుస్తున్నా ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంపై మహిళలు మండి పడుతున్నారు. మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ.1500 అందజేస్తామని చెప్పినా ఆ ఊసే లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమన్నా ఇప్పటికీ వాయిదాల పర్వం కొనసాగుతోంది. తల్లికి వందనానికి సంబంధించి ఇప్పటి వరకు సొమ్ము అందించలేదు. అదే వైఎస్ జగనన్్ సర్కార్ హయాంలో రెండేళ్లు కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వెనుకంజ వేయకుండా ప్రజలను ఆదుకున్న పరిస్థితులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు.

ఆడబిడ్డకు అగచాట్లు!