
మొక్కుబడిగా పౌర హక్కుల దినం
– దళిత సర్పంచ్కు అవమానం
చౌడేపల్లె : పౌర హక్కుల దినం సమావేశం పరికిదొన దళితవాడలో శుక్రవారం మొక్కుబడిగా నిర్వహించారు. పరికిదొన సర్పంచ్ లక్ష్మిదేవి దళిత సర్పంచ్ అయినప్పటికీ ఆమెకు కనీస సమాచారం ఇవ్వకుండా తహసీల్దార్ హనుమంతునాయక్ గ్రామానికి చేరుకొని పౌరహక్కుల దినం మమ అనిపించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతినెలా చివరి శనివారం సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఒక రోజు ముందుగానే అధికారులు సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటని దళిత సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి దళిత నాయకులు, పోలీసుశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో సమావేశం నిర్వహించాల్సి ఉండగా వీరెవరు హాజరుకాలేదు. అయినప్పటికీ తహసీల్దార్ దళితవాడలోని మహిళలు, వృద్ధులతో సమావేశం ముగిసిందని మినిట్స్ రాయించి చేతులు దులుపుకున్నారని సంఘం నేతలు ఆరోపణలు చేశారు. అధికారులే దళిత హక్కులను కాలరాస్తూ అన్యాయం చేస్తున్నారని అంబేడ్కర్ఽ భవన నిర్మాణ కమిటీ అధ్యక్షుడు రెడ్డెప్ప , సర్పంచ్ లక్ష్మిదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.