
భార్యను మోసం చేసి.. మరోపెళ్లి చేసుకున్న భర్తకు జైలు
చిత్తూరు అర్బన్ : భార్య బతికుండగానే.. ఆమెను మోసం చేసి, మరో యువతిని పెళ్లాడిన భర్తకు ఏడాది జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ చిత్తూరులోని న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.ఉమాదేవి కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్కు చెందిన పి.విజయ కుటుంబ సమస్యల కారణంగా తవణంపల్లె మండలం వడ్డిపల్లె గ్రామంలో నివాసం ఉంటున్నారు. బంగారుపాళ్యం మండలం సదకుప్పంకు చెందిన హేమంత్కుమార్ (28) విజయను పెళ్లి చేసుకుని, నాలుగేళ్లు కాపురం చేశాడు. తరువాత తన భార్యకు తెలియకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీనిపై 2020 ఆగస్టులో విజయ పోలీసులకు ఫిర్యాదు చేయగా, బంగారుపాళ్యం పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడిని కోర్టుకు తరలించారు. ఇరుపక్షాల వాదనలు విన్న చిత్తూరులోని ప్రిన్స్పల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు.. హేమంత్కుమార్ చేసిన పనిని తప్పుపట్టింది. విజయను మోసం చేసి రెండోపెళ్లి చేసుకున్నందుకు నిందితుడికి ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఉమాదేవి తీర్పునిచ్చారు. అనంతరం నిందితుడిని చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు.