విజయపురం : రోడ్డు పక్కన ఆగి ఉన్న రోడ్డు రోలర్ను బైక్తో ఢీకొని తమిళ్ సెల్వన్ (24) అనే యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం పన్నూరులో చోటు చేసుకొంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా...ఇష్టకామేశ్వపురం గ్రామానికి చెందిన దొరస్వామి రెండో కుమారుడు తమిళ్ సెల్వన్ సొంత పని నిమిత్తం కనకమ్మసత్రం వెళ్తుండగా పన్నూరు దళితవాడ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న రోడ్డు రోలర్ను బైక్తో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం నగరి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంగా తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరానికి చెందిన రవి (41) అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ మహేశ్వర కథనం మేరకు... చిత్తూరులోని గూలింగ్స్ పేటకు చెందిన రవి ఓ ప్రైవేటు కంపెనీలో ఎలక్ట్రీషన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు చుట్టు ముట్టడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో మేకలు మృతి
పుత్తూరు : మండల పరిధిలోని ఎగవ కనకంపాళెం గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన బుధవారం సాయంత్రం 10 మేకలు మృతి చెందాయి. మేకలు దిగువ కనకంపాళెం గ్రామానికి చెందినవి కాగా వాటి మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతి చెందిన మేకలను గ్రామస్తులు పూడ్చిపెట్టినట్లు సమాచారం.