
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల ఎంపిక
తిరుపతి కల్చరల్: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన వివిధ నియోజకవర్గాల నేతలను పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలలో వివిధ హోదాలలో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర యూత్ వింగ్ జోనల్ అధ్యక్షుడిగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన పిట్టా హేమంత్రెడ్డి, రాష్ట్ర యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా చంద్రగిరికి చెందిన చెవిరెడ్డి మోహిత్రెడ్డిని, రాష్ట్ర యూత్ వింగ్ కార్యదర్శులుగా నగిరికి చెందిన డీ.లోకనాథం, మల్లం రవిచంద్రారెడ్డి(తిరుపతి), ఎస్.కిషోర్(పలమనేరు) నియమితులయ్యారు. అలాగే రాష్ట్ర యూత్ వింగ్ సహాయ కార్యదర్శులుగా భాగ్యరాజ్ ప్రభంజన్ (కుప్పం), చెంగారెడ్డి(పుంగనూరు), కె.శశిథర్రెడ్డి(చంద్రగిరి), పి.దొరబాబు(పూతలపట్టు), శిబి చంక్రవర్తి(సత్యవేడు) ఎంపికయ్యారు. రాష్ట్ర వలంటీర్స్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా దిండివరం గణేష్(తిరుపతి), రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శిగా సీఎస్.హరీష్ (పూతలపట్టు) నియమితులైనట్టు పేర్కొంది.
‘సదరం’ పాట్లు
చిత్తూరు రూరల్(కాణిపాకం) : చిత్తూరు ప్రభు త్వ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం పునః పరిశీలన కార్యక్రమంలో దివ్వాంగులు అవస్థలు ప డ్డారు. శుక్రవారం ఆ పరీక్ష కేంద్రం వద్ద విక లాంగత్వ పింఛన్దారులు గుమికూడి పునఃపరిశీలన పరీక్ష చేసుకునేందుకు కుస్తీ పట్టారు. ఇటు వైద్యులు, అటూ పింఛన్ దారులు ఇబ్బందులు పడ్డారు. అక్కడ కూర్చుకోవడానికి సరైన సదుపాయాలు ఏర్పాటు చేయలేదు.
జూన్ 12 వరకు వికసిత్ కృషి సంకల్ప అభియాన్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం చేపట్టినట్లు జేడీ మురళీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమాలు జూన్ 12వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. కరకంబాడి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జిల్లాలోని 15 మండలాల్లో రైతులకు చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. తొలి దశలో వెదరుకుప్పం, కార్వేటినగరం, పెనుమూరు, నగరి, నిండ్ర, విజయపురం మండలాల్లో చేపట్టే కార్యక్రమాల్లో రైతులకు సాంకేతిక యాజమాన్యాలు పద్ధతులు, ప్రకతి వ్యవసాయ పద్ధతులు, సస్యరక్షణ చర్యలు తదితర అంశాలు తెలియజేయనున్నట్లు జేడీ వివరించారు.
ఎన్ఎస్యూ డీఈ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ దూర విద్యాకేంద్రం ఆధ్వర్యంలో పలు కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ సి.రంగనాథన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా సంస్కృతంలో ఆరు నెలల వ్యవధి సర్టిఫికెట్ కోర్సు, ఏడాది వ్యవధి డిప్లొమో, రెండు సంవత్సరాల వ్యవధి పాక్శాస్త్రి కోర్సులు ఉన్నాయని తెలియజేశారు. ఈ కోర్సులకు ఆసక్తిగల వారు వచ్చేనెల 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9440626562 నంబర్ను సంప్రదించాలని సూచించారు.