రసవత్తరంగా కుస్తీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా కుస్తీ పోటీలు

May 17 2025 6:31 AM | Updated on May 17 2025 6:31 AM

రసవత్తరంగా కుస్తీ పోటీలు

రసవత్తరంగా కుస్తీ పోటీలు

– జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి పోటీలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రంలోని మెసానికల్‌ మైదానంలో రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో పాల్గొన్న వివిధ జిల్లాల క్రీడాకారులు నువ్వా...నేనా అన్నట్టు తలబడ్డారు. ఈ పోటీలకు రాష్ట్ర స్థాయిలోని వివిధ జిల్లాల నుంచి అండర్‌–17, అండర్‌–23 విభాగాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. మొదటి రోజు ప్రారంభమైన ఈ పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన అండర్‌ 17 బాల, బాలికల కుస్తీ క్రీడాకారులు తలబడ్డారు. ఈ నెల 17న నిర్వహించే పోటీల్లో అండర్‌ 23 బాల, బాలికల జట్ల క్రీడాకారులు పాల్గొననున్నారు. కుస్తీ పోటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కే పురుషోత్తం, రాష్ట్ర సెక్రటరీ భూషణం, కోచ్‌ రఫి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement