
భయపెట్టిన ఈదురు గాలులు
● నేలకొరిగిన చెట్లు, స్తంభాలు, దాబాలు
పుంగనూరు/చౌడేపల్లె: పుంగనూరు, చౌడేపల్లె మండలాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం తీవ్రమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పుంగనూరు – భీమగానిపల్లె జాతీయ రహదారిపై కృష్ణదేవరాయుల సర్కిల్లో వున్న హైమాస్క్ లైట్లు గాలికి విరిగిపోయాయి. జాతీయ రహదారిలో ఉన్న దాబాల పైకప్పుకు వేసిన రేకులు ఎగిరిపోయాయి. ఆ సమయంలో నిర్వాహకులు మినహా ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అలాగే సింగిరిగుంట, మంగళం, ఏటవాకిలి, మొరుంపల్లి, బండ్లపల్లి, గుడిసెబండ తదితర ప్రాంతాల్లో టమాట పంట దెబ్బతినింది. చౌడేపల్లె మండలంలోనూ గాలీవాన భీభత్సం సృష్టించింది. వడగండ్ల వాన కురిసింది. మామిడి, వరి, బీర తదితర పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు.

భయపెట్టిన ఈదురు గాలులు

భయపెట్టిన ఈదురు గాలులు