సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఇక ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంకు | - | Sakshi
Sakshi News home page

సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఇక ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంకు

May 2 2025 1:49 AM | Updated on May 2 2025 1:49 AM

సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఇక ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాం

సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఇక ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలోని సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌ పేరు గురువారం నుంచి ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంక్‌ పేరుగా మారింది. త్వరలో ప్రధాన కార్యాలయం నుంచి బ్రాంచ్‌ కార్యాలయం వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచ్‌ల పేర్లను మార్చనున్నా రు. ఉమ్మడి జిల్లాతోపాటు కృష్ణా జిల్లాలో 264 బ్రాంచ్‌లు ఉన్నాయని బ్యాంక్‌ అధికారులు తెలిపారు. ఒకప్పటి శ్రీవెంకటేశ్వర గ్రామీణ బ్యాంకు, కనకదుర్గ గ్రామీణ బ్యాంకు కలిసి 2006లో సప్తగిరి గా మారాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంకుగా సేవలు అందించనుంది.

పౌల్ట్రీరంగంతో ఉపాధి కల్పనకు చర్యలు

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లాలో పౌల్ట్రీ రంగంతో ఉ పాధి కల్పనకు చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పశుసంవర్థక శాఖ, పాడిపరిశ్రమ, పౌల్ట్రీ రంగం నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రైతు లు వ్యవసాయ రంగంతోపాటు పాడి పరిశ్ర మ, పౌల్ట్రీ రంగాల్లోని ఉపాధి అవకాశాలను స ద్వియోగం చేసుకోవాలన్నారు. ఆ అవకాశాల తో ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. వ్యవసాయ రంగంతోపాటు పాడి పరిశ్రమ, పౌల్ట్రీ రంగాల్లో ఉ పాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పౌల్ట్రీ రంగంలో ఆసక్తి ఉన్న రైతులకు నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సహకారంతో ముందుగా పౌల్ట్రీ రంగంలో విజయవంతమైన రైతులతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ రంగంలో ఆసక్తి ఉన్న రైతులకు పౌల్ట్రీ ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సా యం బ్యాంకర్లతో అందించేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఇందుకు అవసరమైన డీపీ ఆర్‌లను సిద్ధం చేసుకోవాలని అధికారులను సూచించారు.

కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు వేతన వెతలు

గుడుపల్లె: రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ కళాశాల లో కాంట్రాక్ట్‌ అధ్యాపకులుగా పనిచేస్తున్న 3,618 మందికి ఏడాదిగా జీతాలు అందలేదని ఆ యూ నియన్‌ ఉపాధ్యక్షుడు నౌషద్‌ ఖాన్‌ పేర్కొన్నారు. 2024 సంవత్సరం మే నెల నుంచి ఇప్పటి వరకు జీతాలు అందలేదన్నారు. పెండింగ్‌ జీతాలు చెల్లించి, వచ్చే విద్యా సంవత్సరానికి రెన్యూవల్‌ చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రికి, ఉన్నతా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement