కౌండిన్యలో ఏనుగుల సంచారం | - | Sakshi
Sakshi News home page

కౌండిన్యలో ఏనుగుల సంచారం

May 2 2025 1:49 AM | Updated on May 2 2025 1:49 AM

కౌండిన్యలో ఏనుగుల సంచారం

కౌండిన్యలో ఏనుగుల సంచారం

బంగారుపాళెం: మండలంలోని మొగిలి దేవరకొండ అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం రెండు ఏనుగులు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. దేవరకొండ సమీపంలో గల కౌండిన్య అడవిలో ఏనుగులు తిరుగుతున్నాయన్నారు. బుధవారం సాయంత్రం మొగిలి సమీపంలోని గౌనిచెరువులో ఏనుగులు నీటిలో సేదతీరి అడవిలోకి వెళ్లిపోయాయి. తిరిగి రాత్రి మొగిలి గ్రామంలోని శ్రీనిఫుడ్‌ ఫ్యాక్టరీ వద్దకు రెండు ఏనుగులు ప్రవేసించి హల్‌చల్‌ చేయడంతో సె క్యూరిటీ, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఏ నుగుల రాకను గుర్తించి కేకలు వేయడంతో అడవిలోకి వెళ్లిపోయాయి. ఏనుగులు దేవరకొండ ప్రాంతంలో తి రుగుతున్నాయని తెలిపారు. ఏనుగులు సంచారంతో అడవిలోకి ఎవరూ వెళ్లరాదని ఫారెస్టు అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement