
జిల్లాలో 201 రిజిస్ట్రేషన్లు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని చిత్తూరు ఆర్వో మినహాయించి మిగిలిన 7 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం బుధవారం ప్రారంభమైంది. జిల్లాలో మొ త్తం 201 రిజిస్ట్రేషన్లు కాగా వాటి ద్వారా రూ.75.88 లక్షలు ఆదాయం వచ్చింది. చి త్తూరు రూరల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి, సబ్రిజిస్ట్రార్ ఆనంద్తో కలిసి డ్యాకుమెంట్లను కోనుగోలుదారులకు అందజేశారు. చిత్తూరు రూరల్లో 33 డ్యాకుమెంట్లు జరగగా రూ.10.29 లక్షలు, పలమనేరు 32 డ్యాకుమెంట్లు రూ.14.39 లక్షలు, బంగారుపాళెం 19 రూ.10.93 లక్షలు, నగరి 25 రూ.21.94 లక్షలు, పుంగనూరు 36 రూ.6.91 లక్షలు, కుప్పంలో 36కు రూ.7 లక్షలు, కార్వే టినగరం 24 రూ.4.33 లక్షలు ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు.
నేటి నుంచి రేషన్ పంపిణీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి రేషన్ పంపిణీ చేయనున్నట్లు డీఎస్ఓ శంకరన్ తెలిపారు. రేషన్కార్డుదారులకు పంపిణీ కోసం ప్రభుత్వం జిల్లాకు 8,500 మెట్రిక్ టన్నుల బియ్యం, 3 వేల మెట్రిక్ టన్నుల చక్కెర సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.