
మాజీ మంత్రి రోజా విస్తృత పర్యటన
నగరి : ప్రారంభోత్సవాలు, వేడుకలు అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుధవారం అరక్కోణం పనంబాకంలో నగరి పట్టణానికి చెందిన వారు నూతనంగా నిర్మించిన ఏజేఎస్ కళ్యాణ మండపాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం తిరుపతి పద్మావతిపురం సుబ్బయ్య ఫంక్షన్ హాల్లో స్విమ్స్ అమర్ కుమార్తె ఓణీ ఫంక్షన్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. వడమాలపేట మండలం పూడి గ్రామంలో వైస్ సర్పంచ్ రాజశేఖర్ గారి కుమార్తె ఓణీ ఫంక్షన్లో పాల్గొని, చిన్నారిని ఆశీర్వదించారు. అనంతరం నిండ్ర మండలం ఎక్స్ సర్పంచ్ రేవతి కుమార్తె నిశ్చితార్థంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.