
● కొత్త స్థానాల్లో గ్రేడ్–2 హెచ్ఎంలు ● సీనియర్ ఎస్ఏ
హెచ్ఎం బదిలీలు షురూ
చిత్తూరు కలెక్టరేట్ : బదిలీల ప్రక్రియలో మొదటి అంకం అయిన గ్రేడ్–2 హెచ్ఎంల బదిలీల ఉత్తర్వులు గురువారం జారీ అయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న హెచ్ఎంలు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో బదిలీ అయిన హెచ్ఎంలు కొత్త పాఠశాలల్లో చేరారు. ఈ నెలలో కొంత మంది హెచ్ఎంలు ఉద్యోగ విరమణ కానున్నారు. ఆ పోస్టుల్లో ఉన్న హెచ్ఎంలు ఇంకా రిలీవ్ కాకపోవడంతో జూన్ 1వ తేదీన విధుల్లో చేరనున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 169 మంది గ్రేడ్ 2 హెచ్ఎంలు నూతన పాఠశాలలకు బదిలీ అయ్యారు.
కొనసాగిన ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్
ఉద్యోగోన్నతులకు అర్హత పొందిన వారికి గురువారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో చేపడుతున్న ఈ ప్రక్రియలో దాదాపు 155 మంది సీనియర్ స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి పొందనున్నారు.
వైభవంగా
మహాకుంభాభిషేకం
కాణిపాకం : కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ మహా కుంభాషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయం జీర్ణోద్దారణ, అష్టబంధన, మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకంలో భాగంగా మూడో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ అధికారులు, ఉభయదారులు, దాతలు ఊరేగింపుగా కలశాలను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఓ పెంచల కిషోర్, దాత అనిల్ కుమార్, దేవస్థానం మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి, ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు పాల్గొన్నారు.

● కొత్త స్థానాల్లో గ్రేడ్–2 హెచ్ఎంలు ● సీనియర్ ఎస్ఏ