
పీఎం సూర్యఘర్ లక్ష్యం పెంపు
చిత్తూరు కార్పొరేషన్ : పీఎం సూర్యఘర్ లక్ష్యా న్ని పెంచుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. గురువారం విజయవాడ నుంచి సీఎండీలతో కలిసి అన్ని జిల్లాల ట్రాన్స్కో ఎస్ఈలతో నిర్వహించిన వీడియో సమావేశంలో మాట్లాడారు. జిల్లా ఎస్ఈ కార్యాలయం నుంచి ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్, టెక్నికల్ ఈఈ జగదీష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా లక్ష సర్వీసులు లక్ష్యంగా నిర్దేశించామన్నారు. వీటిని జూన్ నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. బీసీలకు అదనంగా రూ.20 వేలు రాయితీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభు త్వం అంగీకారం తెలిపిందన్నారు. 200 యూ నిట్లు విద్యుత్ వాడే ఎస్సీ, ఎస్టీ సర్వీసులకు ఉచితంగా సౌర ఫలకాలు ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు. అదే విధంగా బీసీలకు ఇస్తున్న రాయితీ గురించి అవగాహన కల్పించాలన్నా రు. నెలకు 300 యూనిట్లు వాడుతున్న సర్వీసులకు వీటిని వినియోగించుకునే విధంగా ప్రచా రం చేయాలన్నారు.
జెడ్పీలో బదిలీల కౌన్సెలింగ్
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా పరిషత్లో బదిలీలకు అర్హులైన వారికి గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఐదు సంవత్సరాలు పైగా పనిచేస్తున్న సీనియర్ సహాయకులు 11 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సీఈఓ రవికుమార్నాయుడు కౌన్సెలింగ్ నిర్వహించారు. మిగిలిన ఉద్యోగులతో చర్చించి బదిలీల ప్రక్రియను తదుపరి ముగించనున్నట్లు సీఈఓ తెలిపారు. పంచాయతీరాజ్లో చిత్తూరు ఏఈ ఉమా మహేష్ ఐరాలకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పీఆర్ ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఆర్అండ్బీలో జూనియర్ సహాయకులు 7 మంది, టైపిస్టులు 4, రికార్డు సహాయకులు 3, అటెండర్లు 24 మంది ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ శ్రీనివాసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.
జూన్ 4 నుంచి వేరుశనగ విత్తన పంపిణీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో జూన్ 4వ తేదీ నుంచి వేరుశనగ విత్తనాల పంపిణీ ప్రారంభించనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో గురువారం ఆయన ఏడీఏలతో పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఖరీఫ్కు సంబంధించి జిల్లాకు ఇప్పటి వరకు 15943 క్వింటాళ్ల విత్తనం వచ్చిందన్నారు. మరో 10 వేల క్వింటాళ్ల వరకు కాయలు రావాల్సి ఉందన్నారు. జూన్4వ తేదీన చేపట్టబోయే పంపిణీ అన్ని ప్రాంతాల్లో పకడ్బందీగా చేపట్టాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు డ్రోన్లు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో చిత్తూరు, నగరి, పలమనేరు, పుంగనూరు ఏడీఏ ఉమ, సౌభాగ్యలక్ష్మి, గీతాకుమారి, శివకుమార్ పాల్గొన్నారు.
నేడు మెగా యోగా
చిత్తూరు కలెక్టరేట్ : యోగాంధ్రా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చిత్తూరు నగరంలోని పోలీస్ పరేడ్లో మెగా యోగా కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో మెగా యోగా క్యాంపెయిన్ శుక్రవారం ఉదయం 6.30 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
పెండింగ్ జీతాలు చెల్లించాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు డిమాండ్ చేశారు. ఆ సంఘం నాయకులు గురువారం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ బడుల్లో విధులు నిర్వహిస్తున్న ఆయాలకు 2 నెలల పెండింగ్ జీతాలతో పాటు 2019–2021 జీతాలు మంజూరు చేయాలన్నారు. 2019–2021 వరకు సుమారు 36 నెలల జీతాలు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 350 మంది ఆయాలకు చెల్లించాలన్నారు. కొంత మందికి 18 నెలల జీతాలు ఇచ్చి మరికొంత మందికి 14 నెల జీతాలు పెండింగ్లో పెట్టారన్నారు. రాజకీయ కక్షతో తొలగించిన ఆయాలను విధుల్లోకి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఆయమ్మల అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఆశ, జిల్లా ప్రధాన కార్యదర్శి జయకుమారి పాల్గొన్నారు.

పీఎం సూర్యఘర్ లక్ష్యం పెంపు