ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి

Apr 30 2025 12:22 AM | Updated on Apr 30 2025 12:22 AM

ఉద్యో

ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్‌ ఉద్యోగుల డిమాండ్లను కూటమి ప్రభుత్వం నె రవేర్చాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వా డ గంగరాజు డిమాండ్‌ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట కమ్యూనిటీ హెల్త్‌ ఉద్యోగులు రెండో రోజు నిరవధిక సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెకు సీఐటీయూ నాయకులు మద్దతు ప లికారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్‌ ఉద్యోగుల న్యాయమైన స మస్యలు పరిష్కరించాలన్నారు. కమ్యూనిటీ హెల్త్‌ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఏపీ మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొ వైడర్స్‌, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు నిరంజన్‌, ప్రధాన కార్యదర్శి సందీప్‌ కుమార్‌, నాయకులు వినోద్‌, మమత, శ్రీవాణి, అనిత పాల్గొన్నారు.

2న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

చిత్తూరు కార్పొరేషన్‌: తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం మే 2వ తేదీన కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేయనున్నట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గంగరాజు తెలిపారు. మంగళవారం స్థానిక యూనియ న్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం చేసుకున్న తల్లులను సురక్షితంగా వాహనాల్లో ఇంటికి చేర్చే డ్రైవర్ల సమస్యలు తీర్చడం లేదన్నారు. వాహనాలను మరమ్మ తు చేయడం లేదన్నారు. తల్లీబిడ్డల సంరక్షణ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, డ్రైవర్లు పాల్గొన్నారు.

నేడు పాలిసెట్‌

పలమనేరు: పట్టణంలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో బుధవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న పాలిసెట్‌ ఎంట్రెన్స్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు స్థానిక పాలిసెట్‌ కో–ఆర్డినేటర్‌ మహమూద్‌ తెలిపా రు. పట్టణంలోని పాలిటెక్నిక్‌ కళాశాల, మున్సిపల్‌ ఆఫీసు ఎదురుగా ఉన్న బాలికోన్నత పాఠశాల, గుడియాత్తం రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హైస్కూల్‌, మదనపల్లె రోడ్డులోని సాయి శ్రీచైతన్య కళాశాల సెంటర్లలో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు 1626మంది విద్యార్థులు రాయనున్నట్టు తెలిపారు. ఇక్కడి సెంటర్లలో ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను ఎస్వీయూ రీజియన్‌ ఆర్‌జేడీ నిర్మల్‌కుమార్‌ ప్రియ, జిల్లా కో–ఆర్డినేటర్‌ జగన్నాధరావు, జిల్లా పరిశీలకు లు సుబ్బన్న పరిశీలించారు. ఇప్పటికే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్న విద్యార్థులు సంబందిత సెంటర్లకు గంట ముందుగా చేరుకోవాలని వారు సూచించారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం ఐదుగురు చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఐదుగురు జాయింట్‌ సూపరింటెండెంట్లు, ఆరుగురు డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, వందమంది ఇన్విజిలేటర్లు,40మంది అసిస్టెంట్లు, ఏడుగురు అబ్జర్వర్లు నియమితులయ్యారని, వీరంతా ఆర్డీఓ పర్యవేక్షణలో ఉంటారన్నారు.

ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి 
1
1/1

ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement