వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Mar 30 2023 1:32 AM | Updated on Mar 30 2023 1:32 AM

గంగవరం : స్థానిక డ్రైవర్స్‌ కాలనీలో మంగళవారం రాత్రి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. కాలనీకి చెందిన అశోక్‌కు తమిళనాడులోని వేలూరు చెందిన నందిని(29)కి మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి భాగ్యలక్ష్మి(2)అనే కూతురు ఉంది. అత్తామామాలతో కలిసి ఉండలేక నందిని తన భర్తతో కలిసి అద్దె ఇంటికి మారింది. ఈ క్రమంలో అశోక్‌ తాగుడికి బానిసయ్యాడు. మద్యం అలవాటు మానేయాలని చెప్పినా వినేవాడు కాదు. దీంతో అనేక పర్యాయాలు నందిని అలిగి పుట్టింటికి వెళ్లిపోయేది. తర్వాత భార్యకు నచ్చజెప్పి తీసుకువచ్చేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. అశోక్‌ తన కూతురును తీసుకుని తల్లిదండ్రుల ఇంటికి వచ్చేశాడు. మనస్థాపం చెందిన నందిని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తిరిగి ఇంటికి వెళ్లిన అశోక్‌ ఈ విషయం గమనించి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నందిని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అశోక్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement