మంగళవారం ఉదయం లాభాల బాటపట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 114.19 పాయింట్ల (0.15 శాతం నష్టం) నష్టంతో 75,200.85 వద్ద, నిఫ్టీ 31.95 పాయింట్ల నష్టంతో (0.14 శాతం నష్టం) 23,618.00 వద్ద నిలిచాయి.
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ లిమిటెడ్, రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్, ఆటోలైన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డిజిటైడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, రామ ఫాస్ఫేట్స్ లిమిటెడ్, యునైటెడ్ ఫుడ్బ్రాండ్స్ లిమిటెడ్, డైమైన్స్ & కెమికల్స్ లిమిటెడ్, నియోజెన్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


