మైక్రోసాఫ్ట్‌ ఎఫెక్ట్‌పై ఆర్‌బీఐ కీలక ప్రకటన | RBI Says About Microsoft Outage | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్‌ ఎఫెక్ట్‌పై ఆర్‌బీఐ కీలక ప్రకటన

Jul 19 2024 9:22 PM | Updated on Jul 20 2024 8:58 AM

RBI Says About Microsoft Outage

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ప్రభావం చూపెట్టింది. భారత్‌లోని విమానయాన, బ్యాంకింగ్‌ సేవల్లో అంతరాయం ఏర్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది.  

భారత్‌లోని 10 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై అది స్వల్ప ప్రభావం చూపినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు వెల్లడించింది. అయితే, ఇది స్వల్ప అంతరాయమేనని, వాటిలో కొన్ని ఇప్పటికే పరిష్కరించినట్లు స్పష్టం చేసింది. చాలా బ్యాంకుల కీలక వ్యవస్థలు క్లౌడ్‌లో లేవని, కొన్ని బ్యాంకులు మాత్రమే క్రౌడ్‌ స్ట్రైక్‌ వినియోగిస్తున్నాయని ఆర్‌బీఐ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement