హైదరాబాద్: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NAREDCO) తెలంగాణ విభాగానికి సంబంధించి 2026-2028 కాలానికి నూతన కార్యవర్గ సభ్యులు, కీలక అధికారుల నియామకం పూర్తయింది. మంగళవారం హైదరాబాద్లోని 'ఏపీఆర్ ఐల్' వేదికగా జరిగిన అసోసియేషన్ 30వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ కొత్త బృందాన్ని అధికారికంగా ప్రకటించారు.
నరెడ్కో తెలంగాణ నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా శ్రీధర్ రెడ్డి కొప్పుల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా కాళీ ప్రసాద్ దామెర, గోపాలకృష్ణ కొరిపల్లి, సెక్రటరీ జనరల్గా వెంకటేశ్వరరావు రావుల, కోశాధికారిగా సుధాకర్ రెడ్డి కొండల నియమితులయ్యారు.
ఎంపికైన నూతన నాయకత్వ బృందం 2026 నుండి 2028 వరకు రెండేళ్ల పాటు అసోసియేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించనుంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో సుస్థిర వృద్ధిని పెంపొందించడం, వృత్తిపరమైన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బృందం పనిచేయనుంది.


