పసిడి వెనక్కి.. వెండి ముందుకు | Gold drops Rs 2800 to Rs 1. 62 lakh per 10gm | Sakshi
Sakshi News home page

పసిడి వెనక్కి.. వెండి ముందుకు

May 27 2026 12:27 AM | Updated on May 27 2026 12:27 AM

Gold drops Rs 2800 to Rs 1. 62 lakh per 10gm

రూ. 2,800 నష్టపోయిన బంగారం 

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరల్లో మిశ్రమ ధోరణి కనిపించింది. మంగళవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి రూ.2,800 నష్టపోయి రూ.1,62,400 వద్ద స్థిరపడింది. వెండి కిలోకి రూ.2,000 పెరిగి రూ.2,73,000కు చేరింది. ఇరాన్‌–యూఎస్‌ మధ్య సంప్రదింపులపై అనిశ్చితులు ఏర్పడడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. 

అమెరికా–ఇరాన్‌ ఒప్పందంపై ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణితో ఉన్నారని చెప్పారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌కు ఒక శాతం నష్టంతో 4,534 డాలర్ల వద్ద, వెండి ధర ఔన్స్‌కు 2 శాతం నష్టంతో 76.49 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement