బీఎస్‌ఎన్‌ఎల్‌ అదనపు టవర్లతో మెరుగైన సేవలు | - | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ అదనపు టవర్లతో మెరుగైన సేవలు

Sep 26 2025 6:16 AM | Updated on Sep 26 2025 6:16 AM

బీఎస్‌ఎన్‌ఎల్‌ అదనపు టవర్లతో మెరుగైన సేవలు

బీఎస్‌ఎన్‌ఎల్‌ అదనపు టవర్లతో మెరుగైన సేవలు

ఖమ్మంమయూరిసెంటర్‌: ఉమ్మడి జిల్లాలో అవసరమైన చోట్ల బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లు ఏర్పాటచేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని టెలిఫోన్‌ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో గురువారం సభ్యులు సమావేశమయ్యారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా మెరుగైన సేవలందేలా 189టవర్ల అవసరముందని టీఏసీ కమిటీ, అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యాన ఎంపీ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు. ఈ సమావేశంలో టీఏసీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, ఇమామ్‌ భాయ్‌, అమరవాడి సత్యనారాయణరెడ్డి, బానోత్‌ రంజిత్‌ నాయక్‌, మచ్చా రామారావు, పల్లెల రామ లక్ష్మ య్యగౌడ్‌, కాంగ్రెస్‌ నాయకుడు కొప్పుల చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement